News
మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం: ఎన్జీటీకి నివేదిక
అమరావతి: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ సమర్పించారు. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో తెలిపారు.
విచారణ కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే 24 గంటల్లో తెలపాలని ఎల్జీ పాలిమర్స్కు ఎన్జీటీ స్పష్టం చేసింది. నివేదిక పరిశీలించి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని ఎన్జీటీ అధికారుల వెల్లడించిరు. నేడో, రేపో ఎన్జీటీ తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో