General Knowledge
Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 26/12/2019
భారతదేశ ప్రధానులు – ప్రత్యేకతలు
జవహర్లాల్ నెహ్రూ (1889 – 1964) | |
» పదవీ కాలం 15-08-1947 నుంచి 27-05-1964. | |
» భారతదేశ మొదటి ప్రధాని. | జవహర్లాల్ నెహ్రూ |
» ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు. (16 సంవత్సరాల 286 రోజులు). | |
» భారత జాతీయ కాంగ్రెస్కు మూడుసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. | |
» పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని. | |
» భారతరత్న అవార్డు (1955) పొందిన మొదటి ప్రధాని. | |
» ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని. | |
» మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. | |
» అలీనోద్యమ నిర్మాతల్లో ఒకరిగా పేరు పొందారు. | |
» పంచశీల ఒప్పందంపై చైనాతో 1954లో సంతకం చేశారు. | |
» ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. | |
» భారతదేశ విదేశాంగ విధాన రూపశిల్పి. | |
గుల్జారీలాల్ నందా (1898 – 1998) | |
» పదవీకాలం 27-5-1964 నుంచి 9-6-1964 వరకు. | గుల్జారీలాల్ నందా |
» మొదటి తాత్కాలిక ప్రధాని. | |
» లాల్బహదూర్ శాస్త్రి మరణాంతరం రెండోసారి 11-1-1966 నుంచి 24-1-1966 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. | |
లాల్బహదూర్శాస్త్రి (1904-1966) | |
» పదవీకాలం 9-6-1964 నుంచి 11-1-1966 వరకు. | లాల్బహదూర్శాస్త్రి |
» 1965లో పాకిస్థాన్తో మన దేశానికి యుద్ధం జరిగినప్పుడు ప్రధానిగా ఉన్నారు. | |
» 1966లో పాకిస్థాన్తో తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. | |
» పదవిలో ఉండగానే మరణించిన రెండో ప్రధాని. | |
» ‘జై జవాన్ – జై కిసాన్’ అనే నినాదాన్ని ఇచ్చారు. | |
» విదేశంలో మరణించిన మొదటి ప్రధాని. | |
» మరణాంతరం భారతరత్న (1966) అవార్డు పొందిన మొదటి ప్రధాని. | |
» మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి కూడా ఈయనే. | |
» ఈయన ఉత్తరప్రదేశ్కు చెందినవారు. | |
» శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నారు. | |
» ‘ఇండియన్ లింకన్’గా పేరుగాంచారు. | |
» హరిత విప్లవం కోసం కృషిచేశారు. | |
» నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈయన కాలంలోనే ఏర్పాటైంది. ఇది ఆయన చేసిన క్షీర విప్లవ కృషిలో భాగం. | |
» ఏ పోర్టుఫోలియో లేకుండా నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. | |
» కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. | |
ఇందిరా గాంధీ (1917-1984) | |
» మొదటిసారి పదవీకాలం 24-1-1966 నుంచి 24-3-1977 వరకు. | ఇందిరా గాంధీ |
» రెండోసారి పదవీకాలం 14-1-1980 నుంచి 31-10-1984 వరకు. | |
» రెండోసారి చరణ్సింగ్ తర్వాత ప్రధానిగా వ్యవహరించారు. | |
» మొదటి మహిళా ప్రధాని. | |
» 1971లో ‘గరీబీ హఠావో’ నినాదాన్నిచ్చారు. | |
» రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి. | |
» 1969లో 14 బ్యాంకుల్ని జాతీయీకరణ చేశారు. | |
» 1980లో మరో 6 బ్యాంకుల్ని జాతీయీకరణ చేశారు. | |
» రాజభరణాలను 1970లో రద్దు చేయించారు. | |
» 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. | |
» భారతరత్న అవార్డు (1971) పొందిన తొలి మహిళ. | |
» దిల్లీలో జరిగిన నామ్ సదస్సు (1983)కు అధ్యక్షత వహించారు. | |
» భారత రాజ్యాంగానికి అత్యధిక సవరణలు (37) ఈమె కాలంలోనే జరిగాయి. | |
» అత్యధికసార్లు అత్యవసర పరిస్థితులు ఈమె కాలంలోనే విధించారు. | |
» అరెస్టైన మొదటి ప్రధాని. | |
» 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాని పదవిలో ఉండి ఓడిపోయారు. | |
» మొదటి పోఖ్రాన్ అణు పరీక్షలు (18 మే 1974) ‘స్మైలింగ్ బుద్ధ’ పేరుతో ఈమె హయాంలోనే జరిగాయి. | |
» భారత్లో తొలిసారిగా మధ్యంతర ఎన్నికల్ని (1971) నిర్వహించిన ప్రధాని. | |
» ఈమె ఉత్తర్ప్రదేశ్కు చెందినవారు. | |
» 1971లో రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. | |
» 1972లో చారిత్రాత్మక సిమ్లా ఒప్పందాన్ని అప్పటి పాకిస్థాన్ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్నారు. | |
» ఎన్నికల్లో జరిగిన అవకతవకల కారణంగా ప్రధాని పదవికి అనర్హురాలిగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. | |
» 15 ఏళ్ల 303 రోజులు ప్రధానిగా వ్యవహరించారు. | |
మొరార్జీ దేశాయ్ (1896-1995) | |
» పదవీ కాలం 24-03-1977 నుంచి 28-7-1979 వరకు. | మొరార్జీ దేశాయ్ |
» మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. | |
» ఆర్థికమంత్రిగా ఎక్కువ పర్యాయాలు (8 సార్లు) కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. | |
» పెద్ద వయసులో (81 ఏళ్లు) ప్రధానిగా వ్యవహరించారు. | |
» 1991లో భారతరత్న అవార్డు అందుకున్నారు. | |
» 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును ఈయన కాలంలోనే తొలగించారు. | |
» ప్రధాని పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి. | |
» మండల కమిషన్ను ఏర్పాటుచేశారు. | |
» నిరంతర ప్రణాళికలు ఈయన కాలంలోనే ప్రవేశపెట్టారు. | |
» దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. | |
» ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానమంత్రుల్ని (చరణ్సింగ్, జగజ్జీవన్రాం)ఈయన కాలంలో నియమించారు. | |
» జన్మస్థలం గుజరాత్. | |
» పాకిస్థాన్ పురస్కారం ‘నిషాన్-ఇ-పాకిస్థాన్’ పొందిన తొలి భారతీయుడు. | |
చరణ్సింగ్ (1902-1987) | |
» పదవీ కాలం 28-7-1979 నుంచి 14-1-1980 వరకు. | చరణ్సింగ్ |
» రైతు బాంధవుడుగా పేరుగాంచారు. | |
» పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని. | |
» లోక్దళ్ పార్టీ వ్యవస్థాపకుడు. | |
» పార్లమెంటులో మొదటిసారిగా విశ్వాసతీర్మానం ప్రకటనను ఈయన కాలంలోనే జారీ చేశారు. | |
» ఉత్తరప్రదేశ్కు చెందినవారు. | |
» ప్రధానమంత్రిగా 23 రోజులు పనిచేయగా ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు. | |
రాజీవ్ గాంధీ (1944-1991) | |
» జన్మస్థలం ముంబయి. | రాజీవ్ గాంధీ |
» పదవీకాలం 31-10-1984 నుంచి 01-12-1989 వరకు. | |
» అతి చిన్న వయసులో (42) ప్రధాని అయ్యారు. | |
» ఓటు హక్కు వయోపరిమితిని 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. | |
» పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు. | |
» కేంద్ర మంత్రిమండలిని అత్యధికంగా (13 సార్లు) పునర్ వ్యవస్థీకరించారు. | |
» సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు. | |
» నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు. | |
» జవహర్ రోజ్గార్ యోజనను ప్రారంభించారు. | |
» ‘బికారీ హఠావో’ నినాదాన్ని ఇచ్చారు. | |
» IPKF (Indian Peace Keeping Force) దళాలను శ్రీలంకకు పంపారు. | |
» ఆఫ్రికా ఫండ్ను ఏర్పరచారు. | |
» బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలొచ్చాయి. | |
» ఈయన మే 21, 1991న హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఏటా మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినంగా భారత ప్రభుత్వం పాటిస్తోంది. | |
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (1931-2008) | |
» జన్మస్థలం ఉత్తర్ప్రదేశ్. | విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ |
» పదవీకాలం 2-12-1989 నుంచి 10-11-1990 వరకు. | |
» మండల కమిషన్ సిఫార్సుల్ని అమలు చేశారు. | |
» విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయారు. | |
» దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టారు. | |
» అంతర్రాష్ట్ర మండలిని తొలిసారిగా ఏర్పాటు చేశారు. | |
» అయోధ్య వివాదంలో భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు. | |
చంద్రశేఖర్ (1927-2007) | |
» పదవీ కాలం 10-11-1990 నుంచి 21-6-1991 వరకు. | చంద్రశేఖర్ |
» జన్మస్థలం ఉత్తర్ప్రదేశ్. | |
» ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని. | |
» ఈయన కాలంలోనే రాజీవ్గాంధీ హత్యకు గురయ్యారు. | |
» భారత్ రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి. | |
» ఈయన్ని ‘యంగ్ టర్క్’ అంటారు. | |
» ‘బోన్సీ బాబా’గా పేరొందారు. | |
» 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు అనుమతినిచ్చి వివాదాస్పదుడయ్యారు. | |
» పార్లమెంటులో కోరం సభ్యుల మద్ధతు లేకుండానే జనతాదళ్ను చీల్చి కాంగ్రెస్ మద్ధతుతో ప్రధానిగా వ్యవహరించారు. | |
పాములపర్తి వెంకట నరసింహారావు (1921-2004) | |
» జన్మస్థలం తెలంగాణ. | పాములపర్తి వెంకట నరసింహారావు |
» పదవీకాలం 21-6-1991 నుంచి 16-5-1996 వరకు. | |
» దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి. | |
» పూర్తి పదవీకాలం మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించిన ఏకైక ప్రధాని. | |
» దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్సింగ్తో కలిసి పునాదులు వేశారు. | |
» పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే ప్రధాని అయిన తొలి వ్యక్తి. తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు. | |
» ‘లుక్ ఈస్ట్’ అనే పాలసీని సూత్రీకరించిన ప్రధాని. | |
» బహు భాషా పండితుడు. | |
» ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా (1971-73) పని చేశారు. | |
» ‘దేశ్ బచావో, దేశ్ బనావో’ నినాదాన్ని ఇచ్చారు. | |
» ఈయన ఆత్మకథ పేరు “The Insider”. | |
అటల్ బిహారీ వాజ్పేయీ (1926) | |
» జన్మస్థలం మధ్యప్రదేశ్. | అటల్ బిహారీ వాజ్పేయి |
» మొదటిసారి పదవీకాలం 16-5-1996 నుంచి 01-6-1996 వరకు. | |
» రెండోసారి 19-3-1998 నుంచి 22-5-2004 వరకు. | |
» మొదటిసారి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా కొనసాగారు. | |
» ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని. | |
» కార్గిల్ యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు. | |
» పోఖ్రాన్లో రెండోసారి అణుపరీక్షలు ‘ఆపరేషన్ శక్తి’ పేరుతో 11 మే, 1998న నిర్వహించారు. | |
» లాహోర్ బస్సు రాయబారం ఈయన కాలంలోనే ప్రారంభమైంది. | |
» అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందాలకు శ్రీకారం చుట్టారు. | |
» ‘జై విజ్ఞాన్’ అనే నినాదాన్ని ఇచ్చారు. | |
హెచ్.డి. దేవెగౌడ (1933) | |
» జన్మస్థలం కర్ణాటక. | హెచ్.డి. దేవెగౌడ |
» పదవీ కాలం 01-6-1996 నుంచి 20-4-1997 వరకు. | |
» దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన రెండో వ్యక్తి. | |
» కేంద్ర క్యాబినెట్ మంత్రి అవ్వకుండానే ప్రధానిగా వ్యవహరించారు. | |
» రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని పదవిని నిర్వహించిన రెండో వ్యక్తి. | |
» పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాకుండా ప్రధాని అయిన రెండో వ్యక్తి. | |
» 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. | |
» అతి తక్కువ మంది లోక్సభ సభ్యుల్ని (44) కలిగియుండి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. | |
ఐ.కె. గుజ్రాల్ (1919-2012) | |
» జన్మస్థలం పాకిస్థాన్లోని జీలం. | ఐ.కె. గుజ్రాల్ |
» పదవీకాలం 21-4-1997 నుంచి 19-3-1998 వరకు. | |
» రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ప్రధాని పదవిని చేపట్టిన మూడో వ్యక్తి. | |
» వరల్డ్ స్టేట్స్మన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు. | |
» జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి (14 పార్టీలు) నేతృత్వం వహించారు. | |
» గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించారు. | |
డాక్టర్ మన్మోహన్ సింగ్ (1932) | |
» పాకిస్థాన్లోని జీలంలోని ‘ఘా’ అనే గ్రామంలో జన్మించారు. | డాక్టర్ మన్మోహన్ సింగ్ |
» మొదటిసారి పదవీకాలం 22-5-2004 నుంచి 25-5-2009 వరకు. | |
» రెండోసారి పదవీకాలం 25-5-2009 నుంచి 26-5-2014 వరకు. | |
» రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధాని అయ్యారు. | |
» ప్రధాని పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త. | |
» విశ్వాసతీర్మానంపై ఓటు వేయలేని మొదటి ప్రధాని. | |
» కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. | |
» యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA) కూటమి ద్వారా ప్రధాని అయ్యారు. | |
» అమెరికాతో 123 అణు ఒప్పందాల్ని కుదుర్చుకున్న ప్రధాని. | |
» దేశంలో సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్నవారిలో 3వ స్థానంలో ఉన్నారు. | |
» లోక్సభ పదవీకాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాని. | |
» 2010లో వరల్డ్ స్టేట్స్మన్ అవార్డు పొందారు. | |
» వరుసగా 5వ సారి అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. | |
» వరుసగా 10సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. | |
నరేంద్ర మోదీ (1950) | |
» 26 మే 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. | నరేంద్ర మోదీ |
» గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. | |
» ‘స్వచ్ఛభారత్’ నినాదాన్ని ఇచ్చారు. | |
» ‘జనధన్ యోజన’ను ప్రారంభించారు. | |
» వారణాసి లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. |
ప్రధానమంత్రుల సమాధుల పేర్లు
ప్రధానమంత్రి | సమాధి పేరు |
జవహర్లాల్ నెహ్రూ | శాంతివన్ |
గుల్జారీలాల్ నందా | నారాయణ్ఘాట్ |
లాల్ బహదూర్ శాస్త్రి | విజయ్ ఘాట్ |
ఇందిరా గాంధీ | శక్తి స్థల్ |
మొరార్జీ దేశాయ్ | అభయ్ ఘాట్ |
చరణ్సింగ్ | కిసాన్ ఘాట్ |
రాజీవ్ గాంధీ | వీర్ భూమి |
చంద్రశేఖర్ | స్మృతి స్థల్ |
పి.వి. నరసింహారావు | జ్ఞాన భూమి |