Blog
Mars Mission ముగిసిన మంగళ్యాన్ సేవలు.. ప్రమాదకర స్థాయికి పడిపోయిన ఇంధనం, బ్యాటరీ లెవెల్స్
అంగారక గ్రహంపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం మంగళయాన్ సేవలు ఇక నిలిచిపోనున్నాయి. ఈ వ్యోమనౌకలోని ఇంధనం, బ్యాటరీ.. సురక్షిత స్థాయి నుంచి దిగువకు పడిపోయాయి. దీంతో మంగళయాన్ ఉపగ్రహం సేవలకు తెరపడినట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉపగ్రహంలో ఇంధనం అయిపోయిందని, బ్యాటరీ డ్రెయిన్ కావడం భూ కేంద్రానికి సంబంధాలు తెగిపోయిన్టటు తెలిసింది. అయితే, దీని గురించి ఇస్రో మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.
Source link