NewsTelugu News
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆన్లైన్ క్లాసులు వాయిదా…
జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్మీడియట్ ఆన్లైన్ క్లాసుల్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) వాయిదా వేసింది.
- తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
- ఇంటర్ ఆన్లైన్ క్లాసుల ప్రారంభం వాయిదా
- జులై 5 వరకు మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్లైన్ క్లాసుల్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఇంటర్ బోర్డు అడ్మిషన్లకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంటర్మీడియట్ మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ 2021 మే 25 నుంచి జూలై 5 వరకు ఉంటుందని తెలిపింది. అదే సమయంలో విద్యార్థులకు జూన్ 1 నుంచే ఆన్లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూలై 5 వరకు కొనసాగనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ ఫామ్ కల్పించింది ఇంటర్ బోర్డు. తెలంగాణలోని ఏ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ కావాలన్నా ఇదే పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్ అడ్మిషన్లకు ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఫామ్ 2021 జూన్ 1న అందుబాటులోకి వస్తుంది. అడ్మిషన్ల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ లో ఎన్రోల్ చేసుకోవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోండి:
- విద్యార్థులు ముందుగా https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆన్లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి Get Details ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- పైన చెప్పిన విధంగా మాత్రమే విద్యార్థులు దరఖాస్తు చేయాలి.
- అడ్మిషన్ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదు.