Blog

డీఆర్డీఓ మరో ఘనత.. లేజర్ గైడెడ్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం


పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లేజర్‌ ఆధారిత ట్యాంకు విధ్వంసక క్షిపణి (ఏటీజీఎం)ని భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ ఆర్మర్డ్‌ కోర్‌ సెంటర్‌ అండ్‌ స్కూల్‌(ఏసీసీఖీఎస్‌)లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఈ ప్రయోగాన్ని అధికారులు బుధవారం తెలిపారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది కచ్చితత్వంతో ఛేదిస్తుందని పేర్కొన్నారు. పరీక్షలో భాగంగా మూడో తరానికి చెందిన ఎంబీటీ అర్జున్‌ యుద్ధ ట్యాంక్‌ నుంచి ప్రయోగించినట్లు వెల్లడించారు.

లేజర్-గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి (ఏటీజీఎం) ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దులతో పాటు భారత సైన్యం శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాత్రివేళ కూడా లక్ష్యాలను చేరుకునేలా దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణి సిద్ధమైంది. ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించేలా రూపొందించిన ఈ అణు సామర్థ్య క్షిపణిని డీఆర్‌డీవో రాత్రి పూట పరీక్షించింది.

ఏటీజీఎం పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. ‘దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్‌ ఆధారిత ట్యాంకు విధ్వంసక క్షిపణిని అర్జున్ యుద్ధ ట్యాంకు నుంచి విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ బృందానికి అభినందనలు.. సమీప భవిష్యత్తులో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గించే దిశగా కృషి చేస్తున్న డీఆర్డీఓ బృందాన్ని చూసి భారత్ గర్విస్తోంది’ అని ట్విట్టర్‌లో రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

‘లక్ష్యంగా ఎంపికచేసుకున్న యుద్ధ ట్యాంకు రక్షణ కవచాన్ని తునాతునకలు చేసేందుకు హై స్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌ (హీట్‌) పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన వార్‌ హెడ్‌ను ఇందులో అమర్చే వెసులుబాటు ఉంది. వేర్వేరు ప్రదేశాల నుంచీ పరీక్షించేందుకు అనువుగా దీన్ని తయారుచేశామని, ప్రస్తుతానికి అర్జున యుద్ధ ట్యాంకుల గన్ నుంచి సంధించేలా పరీక్షలు జరుగుతున్నాయి’ అని అధికారులు తెలిపారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close