Latest Govt Jobs
డిగ్రీ పరీక్షలపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు!
<![CDATA[అవునూ.. మీరు విన్నది నేను అన్నది నిజమే.. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలపై సంచలన తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్టు. అయితే అసలు ఏం జరిగింది? కోర్టు ఏం తీర్పు ఇచ్చింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల్ని నిర్వహించాలని విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) సర్క్యులర్ జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కొనసాగుతుండటంతో పరీక్షల్ని నిర్వహించాలని యూజీసీ సర్క్యులర్ జారీ చేయడంపై డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మార్కులు వేయాలంటూ విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లపై పలుమార్లు వాదనలు విన్న సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేసే అవకాశం లేదని వ్యాఖ్యానించింది.
అయితే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షల్ని వాయిదా వేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) తో చర్చలు జరపాలని కోరింది. చూడాలి మరి ఈసారైనా విద్యార్థుల చర్చలు సఫలం అవుతాయో లేదో.. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన కరోనా వైరస్ వ్యాప్తి ఓ రేంజ్ లో జరుగుతుంది. మొన్నటికి మొన్న అత్యధిక కేసులు ఓకే రోజు 75 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది నెలకొంది. అయితే ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు లేకుండానే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు లేకుండానే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
]]>
Source link