Blog

జీఎస్ఎల్వీ ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా.. క్లియరెన్స్ ఇవ్వని పీఎంవో?


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం సాయంత్రం ప్రయోగించాల్సిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ ప్రయోగానికి సంబంధించిన 24 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మధ్యాహ్నం 3.43 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కౌంట్‌డౌన్‌కు పది నిమిషాల ముందే సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.

బుధవారం మధ్యామ్న షార్ కేంద్రానికి చేరుకున్న ఇస్రో ఛైర్మన్ శివన్‌.. శాస్త్రవేత్తలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కానీ, జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం తెలియలేదు. రాకెట్‌ ప్రయోగానికి ముందు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి క్లియరెన్సు రావాల్సి ఉంటుంది. కౌంట్‌డౌన్‌ సమయం సమీపిస్తున్నా పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం రాకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

సుమారు 2,275 కిలోల బరువున్న అత్యాధునిక భూ పర్యవేక్షిత ఉపగ్రహం. దేశ రక్షణ వ్యవస్థకు తోడ్పాటునందించడంతోపాటు విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్ ముఖ్య ఉద్దేశం. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను తొలిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపాలని ఇస్రో భావించింది. వాతావరణం సానుకూలంగా ఉన్నా, సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడటం విశేషం.

నాలుగు మీటర్ల వ్యాసం కలిగిన ఓగివ్ ఆకారంలో ఉండే పేలోడ్ ఫెయిరింగ్‌ను జీఎస్ఎల్వీ రాకెట్‌లో తొలిసారి వినియోగిస్తున్నారు. జీఎస్ఎల్వీలో ఇది 14 ప్రయోగం. శ్రీహ‌రికోట‌లోని రెండ‌వ లాంచ్ ప్యాడ్‌ను నుంచి జీఎస్ఎల్వీ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. ప్రయోగం జరిగుంటే రాకెట్ ప్రయాణం ప్రారంభమైన 18 నిమిషాల త‌ర్వాత జీశాట్‌-1 ఉప‌గ్ర‌హం… జీటీవో క‌క్ష్య‌లోకి చేరుకుంటుంది. జియోస్టేష‌న‌రీ ఆర్బిట్ భూమికి సుమారు 36వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. జీశాట్-1 ఉప‌గ్ర‌హం ఏడేళ్ల పాటు ప‌నిచేయ‌నున్న‌ది.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close