Blog
చంద్రుడిపైకి నాసా మానవసహిత యాత్ర.. భారత సంతతి వ్యోమగామికి అవకాశం
భారత సంతతి రాజా చారి (43) మాస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని యూఎస్ ఎయిర్ఫోర్స్ అకాడమీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఇక, 2017లో నాసా ఎంపిక చేసిన ఆస్ట్రోనాట్ జాబితాలో చారికి చోటుదక్కింది. ఆగస్టు 2017 నుంచి విధుల్లో చేరిన చారి.. వ్యోమగామి ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకోవడంతో మూన్ మెషీన్కు ఎంపిక చేసింది.
‘ప్రియమైన అమెరికన్ పౌరులారా.. మనల్ని చంద్రుడు, ఆ వెలుపలకు తీసుకువెళ్లే భవిష్యత్ హీరోలను నేను మీకు పరిచయం చేస్తున్నాను’ అంటూ ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వ్యాఖ్యానించారు. ఎనిమిదో జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో ఆర్టెమిస్ బృందంలోని సభ్యులను పరిచయం చేసిన తరువాత పెన్స్ మాట్లాడారు. ‘ఎంపికచేసినవారిలో మహిళలు కూడా ఉన్నారని చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది … గతంలోని గొప్ప హీరోని ప్రతిబింబిస్తూ ఈ రోజు ప్రారంభించాం… ఆర్టెమిస్ జనరేషన్ భవిష్యత్తులో అమెరికా అంతరిక్ష అన్వేషణ వీరులు’అని ఈ సందర్భంగా అన్నారు.
ఆర్టెమిస్ బృందంలోని వ్యోమగాములు విభిన్న నేపథ్యాలు, నైపుణ్యం, అనుభవం నుంచి వచ్చారు. సమూహంలోని చాలా మంది వ్యోమగాములు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్నారు. అత్యధికంగా 55, అతి తక్కువ 32 ఏళ్లు. ఆర్టెమిస్ బృందాన్ని ప్రకటించిన నాసా.. అనంతరం వ్యోమగాములను పంపే వాహనాల కోసం ప్రకటన చేయనుంది. అంతర్జాతీయ వ్యోమగాములు సహా అదనపు ఆర్టెమిస్ సభ్యులు కూడా ఇందులో ఉంటారు.
ఆర్టెమిస్ కార్యక్రమానికి సహకారం అందించినందుకు, నాసా సైన్స్, ఏరోనాటిక్స్ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి అన్వేషణ లక్ష్యాల కోసం ద్వైపాక్షిక మద్దతు ఇచ్చినందుకు , అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ అన్నారు. అన్వేషణ కోసం ఆర్టెమిస్ బృందాన్ని ప్రకటించడం పట్ల మేము సంతోషిస్తున్నాం.. ఇందులో చంద్రుని ఉపరితలంపై నడబోయే తొలి మహిళ, తదుపరి వ్యక్తి ఉన్నారు అని అన్నారు.
Source link