Blog

చంద్రయాన్-2: విక్రమ్‌లోని రోవర్ చెక్కుచెదరలేదా? నాసా ఫోటోలు చెబుతున్నదేంటి?

[ad_1]

చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2లో దక్షిణ ధ్రువంపై దిగుతూ విఫలమైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విక్రమ్.. క్రాష్ ల్యాండింగ్ అయినట్టు గుర్తించారు. అయితే, తాజాగా, విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి నాసా తీసిన ఫోటోలు మిషన్ పట్ల ఆసక్తిని పెంచాయి.

గతేడాది నాసా చిత్రాలను ఉపయోగించి విక్రమ్ శిధిలాలను గుర్తించిన చెన్నైకి టెక్కీ చెందిన షణ్ముగ సుబ్రమణియన్.. తాజాగా, మే నెలలో నాసా విడుదల చేసిన ఫోటోల్లో రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్‌ కదలికలు కూడా ఉన్నాయని, ఇది కొన్ని మీటర్లు కదిలి ఉండవచ్చని ఇస్రోకు మెయిల్ పంపారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కే శివన్ కూడా ధ్రువీకరించారు.

‘ఈ విషయంపై ఇప్పటి వరకు నాసా నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, విక్రమ్ శిధిలాలను ఇంతకు ముందు గుర్తించిన వ్యక్తి దీని గురించి మాకు ఒక మెయిల్ పంపారు. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు.. ప్రస్తుతం సమయంలో మేము ఏమీ చెప్పలేం’ అని శివన్ వ్యాఖ్యానించారు.

విక్రమ్‌తో సంకేతాలు నిలిచిపోయిన తర్వాత నవంబరు 2019లో నాసా లూనార్ రికాన్‌సెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) తొలిసారి శిధిలాలను గుర్తించింది. కానీ, చంద్రుడి ధ్రువ ప్రాంతం వద్ద ఆ సమయంలో చీకటిగా ఉండటంతో ఉపరితలం నుంచి 2 మీటర్ల లోతులో ల్యాండర్ ఉన్నట్టు గుర్తించారు. రోవర్ ఆచూకీ మాత్రం లభ్యంకాలేదు.

‘దక్షిణ ధ్రువంలో జనవరి 4న మరోసారి ఎల్ఆర్ఓ ప్రయాణించిన ఫోటోలను మేలో నాసా విడుదల చేసింది. వీటిని పరిశీలిస్తే రోవర్ ప్రజ్ఞాన్ చెక్కుచెదరకుండా ఉండవచ్చని, అది ల్యాండర్ నుంచి కొన్ని మీటర్ల దూరం ప్రయాణించిందని నేను భావిస్తున్నాను. రోవర్ ఎలా కదిలిందో తెలుసుకోవాలి.. ఇస్రో దీనిని ధ్రువీకరిస్తుందని తాను నమ్ముతున్నాను’ షణ్ముగం సుబ్రమణియణ్ అన్నారు.

విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ ఇస్రో భూకేంద్రానికి కొన్ని సంకేతాలు పంపి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, 2019 సెప్టెంబర్ 7 తెల్లవారుజామున విక్రమ్‌తో సంకేతాలు నిలిచిపోగా, అప్పటి నుంచి సంబంధాలను పునరుద్దరించడానికి తీవ్రంగా ప్రయత్నించినా సఫలం కాలేదు. చంద్రుడి ఉపరితలంపై రోవర్ కదలికలు గుర్తించడమై నిజమైతే.. కమ్యూనికేషన్ తెగిపోయిన విక్రమ్‌లోని ప్రజ్ఞాన్‌ కొన్ని సంకేతాలు పంపించి ఉండవచ్చు. ఏం జరిగిందో విశ్లేషించాలని, ఇప్పుడు స్పష్టత ఏమీ లేదు అని శివన్ అన్నారు.

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close