Latest Govt Jobs

ఆర్మీలో చేరాలనుకునే వారికి.. "గుడ్ న్యూస్"…!!!


<![CDATA[

దేశ రక్షణ కోసం ఎంతో శ్రమించే సైనికుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కంటి మీద కునుకు లేకుండా అహర్నిశలు దేశ సంరక్షణ కోసం పాటు పడే సైనికులకి భారత దేశ ప్రజలు అందరూ ఋణపడే ఉంటారు. అలాంటి భారత ఆర్మీలో చేరాలని ఆరాటపడే యువత ఎంతో మంది ఉంటారు. అయితే చాలా మందికి ఆర్మీలో కి వెళ్లాలని ఉన్నా, అందుకు సంభందించి ఎలాంటి తర్ఫీదు పొందాలి, వారు పెట్టె ఫిజికల్ పరీక్షలకి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి అనే విషయాలపై అవగాహన ఉండదు. అయితే

అలాంటి యువతికి ఈ వార్తా నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆర్మీలో చేరాలని అనుకునే వారికి శ్రీ సాయి డిఫెన్స్ తరుపున ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్టుగా ఆర్మీలో బ్లాక్ కమాండో గా  పనిచేసిన సాయి కృష్ణా రెడ్డి తెలిపారు. ఈ ట్రైనింగ్ లో హాస్టల్ , ఫుడ్ సైతం ఉచితమని తెలిపారు. తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ నుంచీ  వచ్చే విద్యార్ధులకి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తానే స్వయంగా ఫిజికల్ ఫిట్నెస్ పై శిక్షణ ఇస్తానని 100 శాతం టెస్ట్ లు పాస్ అయ్యేలా చేస్తానని ప్రకటించారు.

IHG

ఆసక్తి ఉన్న అభ్యర్ధులు , ఫిజికల్ ట్రైనింగ్ కి తట్టుకునే సామర్ధ్యం ఉన్న వాళ్ళు తమ తల్లి తండ్రులతో మార్చి 15 లోగా అకాడమీకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మెడికల్ టెస్ట్ లు చేసిన తరువాత మాత్రమే అకాడమిలోకి తీసుకుంటామని వెల్లడించారు. గోల్కొండ దగ్గర శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ ఉందని ప్రకటించారు. దీనికి సంభందించి ఓ వీడియో సైతం విడుదల చేశారు.  

 

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close